వెయ్యి పెంచడానికి జగన్ కు నాలుగేళ్లు పట్టింది.. చంద్రబాబు ఒక్క సంతకంతో పెంచేశారు!

Header Banner

వెయ్యి పెంచడానికి జగన్ కు నాలుగేళ్లు పట్టింది.. చంద్రబాబు ఒక్క సంతకంతో పెంచేశారు!

  Sat Feb 01, 2025 14:21        Politics

ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రతి నెల ఒకటో తేదీనే పింఛన్లను అందజేస్తున్న సంగతి తెలిసిందే. ఈరోజు కూడా రాష్ట్ర వ్యాప్తంగా పించన్ల పంపిణీ జరుగుతోంది. బాపట్ల జిల్లా జె.పంగులూరు మండలం ముప్పవరంలోని ఎస్సీ కాలనీలో లబ్ధిదారులకు మంత్రి గొట్టిపాటి రవికుమార్ పింఛన్లను స్వయంగా అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... తమ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రతి నెల ఒకటో తేదీన లబ్ధిదారుల ఇంటి వద్దకే వెళ్లి పింఛన్లను అందజేస్తున్నామని చెప్పారు. గత 5 ఏళ్లు జగన్ మోహన్ రెడ్డి పెన్షనర్లను దారుణంగా మోసం చేశారని విమర్శించారు. రూ. 1,000 పెంచేందుకు జగన్ కు నాలుగేళ్లు పట్టిందని ఎద్దేవా చేశారు. కానీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఒక్క సంతకంతో రూ. 1,000 పెంచిన ఘనత చంద్రబాబు గారికే దక్కిందని అన్నారు. 

 

ఇంకా చదవండి: బ‌డ్జెట్‌-2025.. మధ్యతరగతికి భారీ ఊరట.. బడ్జెట్ తో ధరలు దగ్గేవి, పెరిగేవి ఇవే!

 

ప్రతి నెల 1వ తేదీనే వృద్ధులకు రూ. 4 వేలు, దివ్యాంగులకు రూ. 6 వేలు, పూర్తి స్థాయి దివ్యాంగులకు రూ. 15 వేలు పంపిణీ చేస్తూ... దేశంలోనే అత్యధికంగా సామాజిక పెన్షన్లు అందిస్తున్న అతిపెద్ద సంక్షేమ రాష్ట్రంగా మన ఆంధ్రప్రదేశ్ నిలిచిందని సగర్వంగా తెలియజేస్తున్నానని చెప్పారు. ఇది పేదల ప్రభుత్వం..పేదల జీవితాల్లో వెలుగులు నింపే మంచి మనసున్న ప్రభుత్వమని చెప్పారు. ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వంలో ఒక్కొక్కటిగా నెరవేర్చుకుంటూ ముందుకు వెళుతున్నామని రవికుమార్ తెలిపారు. ప్రతి గ్రామంలో సీసీ రోడ్లు వేస్తున్నామని, పాఠశాలల అభివృద్ధి పనులు వేగంగా సాగుతున్నాయని చెప్పారు. రాష్ట్రంలో వైసీపీ పని అయిపోయిందని... ఆ పార్టీ పుంజుకునే పరిస్థితి లేదని అన్నారు.

 

ఇంకా చదవండి: నామినేటెడ్ పదవులు ఆశించేవారు తప్పనిసరిగా ఇలా చేయాలి... ఎమ్మెల్యేలకు పలు కీలక సూచనలు!

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

ఆదాయ పన్నుపై కేంద్రం గుడ్ న్యూస్! కొత్త పన్ను విధానంలో.. సీనియర్ సిటిజన్లకు భారీ ఊరట..

 

మ‌హిళల‌కు గుడ్‌న్యూస్.. ఈ ప‌థ‌కం కింద వ‌చ్చే ఐదేళ్ల‌లో రూ. 2కోట్ల వ‌ర‌కు రుణాలు!

 

రాష్ట్రాలకు రూ.1.5 లక్షల కోట్ల రుణాలు ప్రకటించిన కేంద్ర మంత్రి! 50 ఏళ్లకు వడ్డీ రహిత రుణాలు..

 

అమెరికాలో మరో ప్రమాదం.. విమానం కూలడంతో సమీపంలోని ఇళ్లు, కార్లు దగ్ధం!

 

చంద్రబాబు అధ్యక్షతన టీడీపీ పొలిట్‌బ్యూరో భేటీ.. నామినేటెడ్‌ పోస్టులపై చర్చ!

 

చంద్రబాబు అధ్యక్షతన టీడీపీ పొలిట్‌బ్యూరో భేటీ.. నామినేటెడ్‌ పోస్టులపై చర్చ!

 

టీడీపీ కార్యాలయంలో కోపగించుకున్న లోకేష్! ప్రోటోకాల్ పేరుతో పోలీసుల అత్యుత్సాహం!

 

ఎన్ఆర్ఐ టీడీపీ సెల్ ఆధ్వర్యంలో చంద్రబాబును కలిసిన ప్రవాస ఆంధ్రులు! కష్టాల్లో ఉన్నామని వచ్చిన వారికి 2.5 లక్షల ఆర్ధిక సహాయం!

 

టాలీవుడ్ లో మరో విషాదం.. ప్రముఖ నిర్మాత మృతి! ఎవరంటే!

 

ఏపీ ప్రజలకు అలర్ట్ - ఫిబ్రవరి 1 నుంచి కొత్త ఛార్జీలు! రిజిస్ట్రేషన్ కార్యాలయాల వద్ద రద్దీ!

 

మద్యం ప్రియులకు మరో అదిరే శుభవార్త.. ప్రభుత్వం కీలక ప్రకటన! ఫిబ్రవరి 7న లాటరీ పద్ధతిలో..

 

మరో కీలక నిర్ణయం.. పెన్షన్ తీసుకునే వారికి అలర్ట్.. ఈ కొత్త అప్‌డేట్ మీకోసమే, మిస్ అవ్వొద్దు!

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #GottipatiRaviKumar #Telugudesam #AndhraPradesh #APPolitics #Jagan #pensions